ఇజ్రాయెల్కు ఐఆర్జీసీ చీఫ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇజ్రాయెల్పై ఇరాన్ ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ హసన్ స లామీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్పై ప్రతిదాడికి దిగితే ఆ తర్వాత జరిగే పరిమాణాలకు టెల్అవీవ్ బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో మృతిచెందిన జనరల్ అబ్బాస్ నీలోఫర్సన్ అంత్యక్రియల్లో పాల్గొన్న సలామీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ బలహీనతలు తమకు బాగా తెలుసునని, తమపై దాడులు చేసిన ఎవరూ సురక్షితంగా ఉండలేరని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్కు అమెరికా అందించిన థాడ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. ఈ డిఫెన్స్ వ్యవస్థ ఏ మాత్రం ఆధారపడదగినది కాదని అన్నారు. కాగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఈజిప్ట్ వెళ్లనున్నారు. ఇజ్రాయెల్ దాడులను దౌత్యపరంగా ఎదుర్కొనేందుకు పశ్చిమాసియా దేశాల మద్దతును కూడగడుతున్నారు.