15-11-2024 12:00:00 AM
కొడంగల్ నియోజక వర్గంలోని లగచర్ల గ్రామంలో అధికారుల మీద గ్రామస్తులు రాళ్ళతో దాడి చేయడం తగని పని. ‘ఫార్మా విలేజ్’ ఏర్పాటు, భూసేకరణ నిమిత్తం ప్రజలతో మాట్లాడడానికి అధికారులు వెళ్ళగానే గ్రామస్తులు తిరగబడి దాడి చేసి, తరమడం సమంజసం కాదు. రాజకీయం లబ్ధి కోసమే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ ఖండించాలి. వారిని కఠినంగా శిక్షించాలి. మరోమారు ఇలాంటి ఘటన జరగకుండా అధికారులకు రక్షణ కల్పించాలి.
-కామిడి సతీష్రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా