calender_icon.png 9 October, 2024 | 4:56 AM

లారీలను అడ్డుకున్న పోలీసుపై దాడి

09-10-2024 01:21:02 AM

నిందితులు అరెస్టు

ఎల్బీనగర్, అక్టోబర్ 8: మట్టిరవా ణా చేస్తున్న టిప్పర్లతో స్థానికులకు ఇబ్బంది కలగుతుందంటూ ప్రశ్నించి న హెడ్‌కానిస్టేబుల్‌పై ఎదురుదాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. హయత్‌నగర్‌లోని కంట్లూరు ప్రియదర్శిని కాలనీలో గతకొన్నిరోజులుగా ఒక ఓపెన్ ప్లాట్ వద్ద టిప్పర్లతో మట్టిని రవాణా చేస్తున్నారు.

టిప్పర్ లారీలు అతివేగంగా వెళ్తుండటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వారు డయల్ 100 కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందటంతో హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజేందర్‌రెడ్డి అక్కడికి వెళ్లి టిప్పర్లను అడ్డుకున్నారు.

దీంతో పసుమాముల గ్రామానికి చెందిన మోడపు శ్రీనివాస్‌గౌడ్ కోపోద్రిక్తుడై.. నా లారీలనే అడ్డుకుంటావా? ఎంత ధైర్యం అంటూ తన అనుచరు లు శివ, మధుతో కలిసి హెడ్ కానిస్టేబుల్‌పై దాడికి యత్నించాడు. దీంతో హెడ్‌కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు అతడి అనుచరులను మంగళవారం అరెస్టు చేశారు.