calender_icon.png 18 April, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై దాడి..

10-04-2025 10:27:13 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివారులోని అన్నపూర్ణ లాడ్జి రూమ్ లో గురువారం రాత్రి పేకాట స్థావరంపై టౌన్ సిఐ తిరుమల గౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. 8 మంది పేకాడుతుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 16 వేల 710 రూపాయలు, పేక ముక్కలు సీజ్ చేసి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.