23-04-2025 07:12:05 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పేకాట స్థావరంపై బుధవారం ఎస్సై సురేష్(SI Suresh) ఆధ్వర్యంలో దాడి చేసి పేకాట ఆడుతున్న తుమ్మల సునీల్, ఎస్.కె. సనీర్, ఏనుగుల తిరుపతి, గౌరువంతుల ప్రశాంత్, కడమండ్ల శేఖర్, రాచర్ల రాకేష్, ముప్పు శ్రీధర్, పేరం పోచం అనే 9 మందిని పట్టుకోని వారివద్ద నుండి రూ. 3470/-నగదు 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.