calender_icon.png 22 October, 2024 | 12:14 AM

మంత్రాలు చేస్తున్నారని కుటుంబంపై దాడి

20-10-2024 11:40:31 PM

మెదక్ జిల్లా కిష్టాపూర్‌లో ఘటన

తూప్రాన్, అక్టోబర్ 20: మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ ఎస్సై శివానందం కథనం ప్రకారం.. కిష్టాపూర్ గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తి ఇటీవల చనిపోయాడు. అతని భార్య కమల మ్మ, కోడలు నవనీత, కొడుకు స్వామి, బిడ్డలు, అల్లుళ్లు కలిసి శనివారం రాత్రి పెద్దల పండుగ చేశారు. దీన్ని తప్పుగా భావించిన పక్కింటి వారు.. మంత్రా లు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ వారితో గొడవకు దిగారు. ముగ్గురిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.