నిర్మల్ పట్టణ పరిధిలోని మంజులాపూర్లో జరిగిన గణేశ్ శోభయాత్రలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన ఐదుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శోభాయాత్రలో భాగంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు రోడ్డుపై విగ్రహాన్ని పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. దీంతో కానిస్టేబుల్ సాయిశ్రవంత్ వారిని వారించాడు. అందుకు కోపోద్రిక్తులైన దశరథ ముత్యం, దశరథ ప్రవీణ్కుమార్, దేవొళ్ల వినయ్, సంతోశ్కుమార్, భోజన్న కానిస్టేబుల్పై దాడి చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు.