calender_icon.png 23 October, 2024 | 11:55 AM

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

23-10-2024 01:37:24 AM

నవజాత శిశువును వదిలి వెళ్లిన తల్లి

సిద్దిపేట, అక్టోబర్ 22 (విజయక్రాంతి): నవమాసాలు మోసిన తల్లికి పుట్టిన బిడ్డ బరువైంది. కారణాలు తెలియవు కానీ పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైద్యుల  కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రి ఆవరణలో గుక్కపెట్టి ఏడుస్తూన్న మగశిశువును ఆసుపత్రి నర్సులు, ఆయాలు గుర్తించారు.

ఎవరి బిడ్డ అయి ఉంటుందని ఆసుపత్రిలోని వారందరిని పరిశీలించినా తెలియలేదు. ఈ విషయాన్ని వైద్యులకు తెలిపారు. నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు ఎస్‌ఎన్‌సీలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. అనంతరం సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరి వదిలి వెళ్లారు అనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు.