న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 26: ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యత లు చేపట్టిన ఆతిశీ సీఎం కేజ్రీవాల్ను వెన క్కినెట్టారు. ఢిల్లీ అసెంబ్లీలో గురువారం నుంచి ప్రత్యేక సమావేశాలు ప్రారంభమ య్యాయి. ఆతిశీ సీఎం అయ్యాక మొదటి సారి సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఆమెకు అధికారులు ఒకటో నంబర్ సీటు కేటాయించారు. గతంలో ఆమె 19వ నంబర్ సీటులో కూర్చునే వారు. కాగా సీఎం పద వికి రాజీనామా చేసిన కేజ్రీవాల్కు అసెంబ్లీ లో 41వ సీటు నంబర్ కేటాయించారు. అలాగే సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గహ్ల్లోత్, ముకేశ్ అహ్లావత్ సహా పలువురు ఢిల్లీ మంత్రుల సీటు నంబర్ల్లూ అధికారులు మార్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా సీటు సంఖ్య 94 నుంచి 100కి మారింది. సౌరభ్ భరద్వాజ్కు సభలో రెండో సీటును కేటాయించారు.