న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ మార్లేనా సింగ్ శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఆతిశీతో లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా సింగ్ ఎన్నిక కావడం విశేషం. కేజ్రీవాల్ రాజీనామాతో ఆఫ్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.