న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: అనేక రాజకీయ పరిణామాల మధ్య ఇటీవల ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరి ంచిన ఆతిశీకి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఆమె కాన్వాయ్లో పైలెట్తో సహా పోలీ సు సిబ్బందితో భద్రత కల్పించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆతిశీకి రక్షణగా ఢిల్లీ పోలీసులు 22 మంది షిఫ్టుల వారీగా పనిచేయనున్నారు.
దీనికి తోడు పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు ముప్పును అంచనా వేసి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేర కు కేంద్ర సంస్థలు ఆమె భద్రతను సమీక్షించే అవకాశం ఉంటుంది.