ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు
కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెట్ సంఘం గ్రామంలో మండలస్థాయి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పరమేష్, వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్, సర్దార్ నాయక్, తూర్పు రాజులు, ముకుందరావు, గాంధారి జడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రంగ వెంకటేశ్వర్గౌడ్, పీడీ లక్ష్మణ్రాథోడ్ పాల్గొన్నారు.