calender_icon.png 24 October, 2024 | 9:53 AM

యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో..

12-07-2024 12:05:00 AM

నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానంలో 50 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నారు. ఆయన తొలిసారి హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ చిత్రం 1974, ఆగస్టు 30న విడుదలైంది. వచ్చే ఆగస్టు 30 నాటికి నటుడిగా బాలకృష్ణ సినీ ప్రయాణం ఆరంభించి యాభై ఏళ్ళు పూర్తి కానుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని వేడుకగా జరపాలని నిర్ణయించారు సినీ పెద్దలు. ఈ మేరకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ తరఫున కేఎల్ దామోదర్ ప్రసాద్, సునీల్ నారంగ్, టి.ప్రసన్న కుమార్, వల్లభనేని అనిల్, బాలయ్యని కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కీర్తి పొందినందుకు గాను తెలుగు చలన చిత్ర పరిశ్రమ చేయనున్న సన్మానాన్ని అందుకోవలసిందిగా వారు బాలయ్యను అభ్యర్థించగా, దానికి ఆయన సమ్మతించారు. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమం జరుగనుంది.