calender_icon.png 1 March, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెన్యా దేశంలోని సహకార సంఘంలో వినూత్న వ్యూహాలు పరిశీలించిన సంఘ అధ్యక్షులు

28-02-2025 05:03:57 PM

భీమదేవరపల్లి: కెన్యా దేశంలో రైతులతో ఏర్పాటు కాబడిన సహకార సంఘాలచే నిర్వహించబడుతున్న సంఘాల పనితీరు, వ్యూహాలు సంఘ అభివృద్ధికి తీసుకుంటున్న ప్రక్రియలను ముల్కనూర్ సహకార గ్రామీణ రైతు సంఘం అధ్యక్షులు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు. ఫిబ్రవరి 24 నుండి 28 వరకు కెన్యా దేశంలోని మోంబస నగరంలో ఎన్ ఈ డి ఏ సి జనరల్ కార్యనిర్వాహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ ఈ డి ఏ సి ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. సహకార రంగంలో మరింత ప్రతిభావంతమైన వృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేయబడింది.

సమావేశంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సహకార గ్రామీణ రైతు బ్యాంకు రైతుల అభ్యున్నతి కొరకు చేపడుతున్న పథకాలు గురించి సంఘ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కెన్యా దేశ ప్రతినిధులకు వివరించారు. కెన్యా దేశంలో విజయవంతమైన సహకార సంఘాలు ఆయా సంఘాలచే నిర్వహిస్తున్న వినూత్న వ్యూహాలు తీసుకునే కీలక నిర్ణయాలను సంఘ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు. సమావేశం అనంతరం బ్యాంక్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డిని జ్ఞాపికతో కెన్యా దేశ సహకార సంఘం బాధ్యులు సన్మానించారు. సమావేశంలో ఎన్సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ పంకజ్ కుమార్ బన్సల్, ఇఫ్కో చైర్మన్ ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాన్ని కెన్యా దేశ సహకార సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.