17-03-2025 12:28:39 AM
హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్, యడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్, ఎస్బీహెచ్ కాలనీలోని శ్రీనివాస కమ్యూనిటీ హాల్లో నిరుపేద మూగ, చెవిటి వధూవరుల వివాహాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
జగిని శ్రీనివాస్, నాగమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. చెవిటి, మూగ జంట పెళ్లికి సహాయం చేయాలని తమను సంప్రదించగా వారికి పెళ్లి బట్టలు, తాళి, మట్టెలు అందజేసి వేద పండితుడి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపామని అన్నారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద, దివ్యాంగ వధూవరులు పెళ్లి కోసం తమను సంప్రదిస్తే వారి వివాహన్ని దగ్గరుండి జరిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాంసేవా సమితి సభ్యులు విజయ్కుమార్, నర్సింహారావు, నీల వెంకటేశ్, సురేశ్, బాలరాజు, శ్రీధర్, విశ్వహిందూ పరిషత్ బాధ్యుడు మల్లికార్జున్ పాల్గొన్నారు.