28న సెలవు.. బీఏసీలో నిర్ణయం
రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నేటి నుంచి శాసనమండలి
హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. 25న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మంగళ వారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. 28న ఆదివారం సెలవు ప్రకటించగా, 31న ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలపనున్నది. ఇక శాసన మండలి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.