calender_icon.png 21 September, 2024 | 3:12 AM

ఉద్దెర డబ్బులు ఇవ్వకుండా దాడి

21-09-2024 01:00:05 AM

మనస్థాపంతో మహిళ ఆత్మహత్య

కూసుమంచి, సెప్టెంబర్ 20: ఉద్దెర తీసుకున్న కిరాణ సరుకుల డబ్బులు ఇవ్వమన్నందుకు దాడి చేయడంతో మనస్థాపానికి గురైన మహిళా వ్యాపారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దుబ్బతండాలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన శాంతమ్మ కిరా ణ దుకాణం నిర్వహిస్తున్నది. అదే గ్రామానికి చెందిన జర్పుల శివ ఆ మె వద్ద సరుకులు ఉద్దెర తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకు ండా ఆమెతో గొడవపెట్టుకునే వా డు. శుక్రవారం శివ ఇంటికి వెళ్లిన శాంతమ్మ డబ్బులు ఇవ్వాలని అడిగింది. డబ్బులు ఇవ్వకపోగా ఆమెపై దాడి చేయడంతో మనస్థాపానికి గురైన శాంతమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నాగరాజు తెలిపారు.