తన చెల్లెల్ని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో హత్యాయత్నం
ఘట్కేసర్, సెప్టెంబర్ 20: తన చెల్లెల్ని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదు లు కథనం ప్రకారం.. ఘట్కేసర్ మున్సిపాలిటీ ఈడబ్ల్యూఎస్ కాలనీలో గురువారం రాత్రి గణేశ్ ఊరే గింపు జరుగుతుండగా డీజే ఆపరేటర్గా పనిచేస్తున్న మోక్ష యాదవ్ను అదే ప్రాంతానికి చెందిన మహేందర్ అనే యువకుడు కత్తితో వెనుక నుంచి పొడిచాడు. దీంతో తీవ్రగాయాలు కాగా కీసరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. నిందితుడి సోదరి మానసను ఇటీవల మోక్ష యాదవ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అది ఇష్టం లేకనే హత్యాయత్నానికి పాల్పడినట్లు స మాచారం. మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.