సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ ప్రకటన
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్తో పోరాడుతున్న లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లాకు మరో గట్టి ఎదురురెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల్లో మరో ముఖ్య నేత హషీమ్ సఫీద్దీన్ మరణించాడు. గత నెలలో గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ తాజాగా అతడి వారసుడు సఫీద్దీన్ను అంతమొందించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ బుధవారం ధ్రువీకరించింది. “హెజ్బు ల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చీఫ్ హషీమ్ సఫీద్దీన్, ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్స్ కమాండర్ అలీ హుస్సేన్ హజిమాను 3 వారాల క్రితం హెజ్బుల్లా ఇంటెలిజెన్స్ కార్యాలయంపై జరిపిన దాడిలో అంతమొందించాం” అని ప్రకటించింది. కాగా.. హెజ్బుల్లా సైనిక కార్యకలాపాలను నిర్వహించే ‘జిహాద్ కౌన్సిల్’ బాధ్యతలను సఫీద్దీన్ పర్యవేక్షిస్తున్నాడు.