calender_icon.png 26 October, 2024 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకి హైకోర్టులో ఊరట

26-10-2024 01:08:36 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్25 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల(2023) సమయంలో ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో ఇన్‌కం ట్యాక్స్ లెక్కలు తప్పుగా ఉన్నా యంటూ కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్ నాయక్ హైకోర్టును ఆశ్రయించారు. తొమ్మిది నెలలు గా కేసు కొనసాగుతుంది. శుక్రవారం కేసుపై తుది తీర్పునిచ్చిన హైకోర్టు కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్‌లోని ఇ న్‌కం టాక్స్ లెక్కల్లో ఎ లాంటి తప్పులు లేవని తేల్చిచెప్పింది. ఈ మేర కు కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.