చెన్నై: అశోక్ లేలాండ్కు సంబంధించిన‘ ఓహెఎం గ్లోబల్ మొబిలి టీ’..చెన్నైలోని మెట్రోపాలిటన్ ట్రా న్స్పోర్ట్ కార్పొరేషన్నుంచి 500 అల్ట్రా-లో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులకై ఆర్డర్ను పొందినట్లు గురువారం ప్రకటించింది.ఓహెఎం అశోక్ లేలాం డ్కు సంబంధించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం. ఇది ’మొబిలిటీ యా జ్-ఎ-సర్వీస్’ బిజినెస్పై దృష్టి సారించింది. ఈ ఆర్డర్తో బస్ సెగ్మెంట్లో అశోక్ లేలాండ్ స్థానం మరింత సుస్థిరమయ్యింది.
అశోక్ లేలాండ్కు సంబంధించిన అనుబంధ సంస్థ అయిన స్వి మొబిలిటీ ఎంటీసీ నుం చి పొందిన ఆర్డర్ ప్రకారం 12 ఏళ్ల పాటు బస్సులను నడపడానికి/నిర్వహణకు బాధ్యత వహించేఓహెఎంకు అధునాతన ఈఐవీ మోడల్ బస్సులను అందిస్తుంది.
ఇందులో 400 నాన్-ఏసి, 100 ఏసీ బస్సులు చెన్నై అంతటా ప్రయాణీకులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తాయి. ఈ బస్సులు ఒక్క ఛార్జ్తో 200 కి.మీ పైగా ప్రయాణిస్తాయని, చెన్నై వంటి విస్తృతమైన నగర మార్గాలకు ఈ బస్సులు ఎంతో అనువైనవని కంపెనీ తెలిపింది.