బెల్లంపల్లి (విజయ క్రాంతి) : చొప్పరపల్లి సెక్టార్ పరిధిలోని బూడిది గడ్డ బస్తి అంగన్వాడి కేంద్రంలో విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న టీచర్ ఓటు ప్రమీలను వెంటనే తొలగించాలని సోమవారం జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ కు ప్రజావాణి లో ఎంసిపిఐయు నాయకులు పసులేటి వెంకటేష్, సబ్బని రాజేంద్రప్రసాద్ లు వినతి పత్రం అందజేశారు. బూడిద బస్తి లో అంగన్వాడీ కేంద్రాన్ని సంవత్సరాలుగా తీయకుండా అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. బాలింతలు, చిన్నారులకు అందించే పౌష్టికాహారం లబ్ధిదారులకు ఇవ్వకుండా తన వర్గీయులకే అందజేస్తుందని పేర్కొన్నారు. మంచిర్యాలలో నివసిస్తూ అంగన్ వాడి కేంద్రాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బూడిదిగడ్డ బస్తి అంగన్వాడి టీచర్ ఓటు ప్రమీలను వెంటనే విధులనుండి తొలగించాలని వారు కలెక్టర్ కు అందజేసిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. అదేవిధంగా సోమగూడెం రహదారి పక్కనున్న అసైన్డ్ భూమిని కబ్జా చేసి రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిని వెంటనే అడ్డుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు.