calender_icon.png 18 October, 2024 | 7:58 PM

ఈ నెల 30న ఛలో హైదరాబాద్

27-07-2024 04:39:59 PM

 జిల్లా కలెక్టర్ , డిఎం,హెచ్ఓ కార్యాలయం సూపర్ డెంట్లకు వినతి

మంచిర్యాల, విజయ క్రాంతి : ఆశా వర్కర్స్ యూనియన్  (సీఐటీయు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశాల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 30 న ఛలో హైదరాబాద్ కమీషనర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని ఆశా వర్కర్లం అందరం వెళ్తున్నామని తెలియచేస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు, జిల్లా డీఎం, హెచ్ఓ కార్యాలయం సూపర్ ఇంటెండెంట్ కు వినతిపత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క, శోభ ఆశా యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు,  పద్మ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.