calender_icon.png 23 September, 2024 | 2:55 AM

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆఫీసర్‌గా..

23-09-2024 12:41:47 AM

‘ధమాకా’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ క్రేజీ జంట రవితేజ, శ్రీలీల. ఈ ఇద్దరి కలయికలో రవితేజ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా షురూ అయింది. కాగా చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తిక విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘ఆర్‌టీ75’ టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్‌లుక్ దసరా సందర్భంగా ఉండబోతోందని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఇందులో రవితేజ ఆర్‌పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని సమాచారం.

‘పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజపూజ్యం అన్ లిమిటెడ్.. అవమానం జీరో’ అంటూ ఇందులో రవితేజ పాత్ర ఎలా ఉండబోతుందో ఇప్పటికే హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ 40 శాతం పూర్తవగా.. నెక్ట్స్ షెడ్యూల్ అక్టోబర్ మొదటివారంలో షురూ కానుందని వినికిడి. హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్ మూడు వారాలపాటు కొనసాగనుందని సమాచారం. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య తెరకెక్కిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. 2025లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.