calender_icon.png 24 February, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టిజన్స్ లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి..

21-02-2025 04:50:14 PM

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ ఈశ్వర్ రావు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యుత్తు శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ ఈశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్యుత్ శాఖలో 20 వేల మంది వరకు పనిచేస్తున్న ఆర్టిజన్స్ లను జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్ గా కన్వర్షన్ ఇవ్వాలని కోరారు. ఇదే డిమాండ్ తో ఈనెల 20న చేపట్టిన ఛలో విద్యుత్ సౌధను ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి అరెస్టులు చేశారని ఆరోపించారు.

ఆర్టిజన్స్ లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు. ఛలో విద్యుత్ సౌధలో పాల్గొన్న ఉద్యోగులను, విధుల్లోకి తీసుకోడం లేదని, ప్రభుత్వం తన వైఖరి మార్చుకోక పోతే 20 వేల మంది ఆర్టిజన్స్ విధులు బహిష్కరించి రోడ్డెక్కుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వినర్ ఎంఏ.వజీర్, కో-చైర్మన్లు వి.నరేందర్, సీహెచ్.ఎల్లయ్య, జి.నాగరాజ్, జి.అరవింద్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎస్.చంద్రారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీలు ఎస్.సదానందం, పి.కోటి గౌడ్, సలీం పాషా, మీడియా ఇంచార్జి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.