calender_icon.png 25 October, 2024 | 1:46 AM

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళల అరెస్ట్

25-10-2024 12:01:24 AM

కూకట్‌పల్లి, అక్టోబర్ 24: కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ బస్టాప్ సమీ పంలో వ్యభిచారం నిర్వహిస్తుండగా, గురువారం పోలీసులు దాడిచేసి పలువురు మహిళలను, ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కూకట్‌పల్ల్లి,

కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని యాంటీ ఉమన్ ట్రాఫికింగ్ యూని ట్, షీ టీంతో పాటు పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వ్యభిచారంలో పాల్గొన్న 31 మంది మహిళలతో పాటు నలుగురు ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని కూకట్‌పల్లి తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ చేశారు.