కామారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న ఆవుల ను పట్టుకుని గోశాలకు తరలించిన ఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మాచారెడ్డి మండ లం వాడి గ్రామం వద్ద అవులను డీసీ ఎం వ్యాన్లో తీసుకుని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలకేంద్రం నుంచి హైదారాబాద్ తరలిస్తున్నా రు.
హిందూవాహిని ప్రతినిధులకు సమాచారం అందడంతో వారు మాచారెడ్డి పోలీసులకు సమాచారం అందించా రు. పోలీసులు అక్కడికి చేరుకొని డీసీఎం వ్యాన్లో తరలిస్తున్న 30 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న గోశాలకు తరలించారు.