calender_icon.png 24 October, 2024 | 3:53 PM

భక్తులకు ఇబ్బంది కలగకుండా బోనాల ఏర్పాట్లు

15-07-2024 12:42:18 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు, జూలై 14: పటాన్‌చెరు డివిజన్ పరిధిలో బోనాల పండుగను పుర స్కరించుకొని అమ్మవార్ల ఆలయాలను సుం దరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన బోనాల పండుగ నిర్వహించేందుకు పట్టణ, పుర ప్రముఖుల సమక్షంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం పటాన్ చెరులోని కోదండ సీతారామస్వామి ఆలయంలో బోనాల పండుగ తేదీ నిర్ణయంపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.  అంతకుముందు నాయకుల తో కలిసి కోదండ రాముడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.