04-03-2025 11:08:24 PM
కామారెడ్డి (విజయక్రాంతి): రేపటి నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గట్టు కింది శంకర్ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం ఇన్విజిలేటర్స్ తో సమావేశం నిర్వహించారు. వారు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం శాంతియుతంగా జరిగే విధంగా చూడాలని కళాశాల సిబ్బందికి సూచించారు. పరీక్షల నిర్వహణకు సహాయం అందిస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల వారికి ధన్యవాదాలు తెలియజేశారు.