04-03-2025 07:19:24 PM
టేకులపల్లి (విజయక్రాంతి): ఈ నెల 5 నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు టేకులపల్లి ప్రభుత్వం జూనియర్ కళాశాల సిఎస్ కే.బసవమ్మ, డిఓ కే ప్రసాద్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం ఇన్విజిలేటర్స్ తో సమావేశం నిర్వహించారు. వారు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం శాంతియుతంగా జరిగే విధంగా చుడాలని కళాశాల సిబ్బందికి సూచించారు. పరీక్షల నిర్వహణకు సహాయం అందిస్తున్న అన్ని డిపార్ట్మెంట్ల వారికి ధన్యవాదాలు తెలియజేశారు.