05-04-2025 12:00:00 AM
ఘనంగా కూచిపూడి భరతనాట్య కార్యక్రమాలు
చిట్యాల, ఏప్రిల్ 4(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక గ్రామంలోని నాపాక దేవాలయ ప్రాంగణంలో 6వ తేదీన ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ యాదడ్ల రాజయ్య తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,పలువురు రాజకీయ నాయకులు హాజరవుతారని తెలిపారు.
ఈ ప్రాచీన ఆలయం రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం ఒకే శిలపై నాలుగు ద్వారాలకు నాలుగు విగ్రహాలను రూపొందించి ఉంటుందన్నారు. ఏకశిలపై గుడిని ప్రాచీన కట్టడాలతో నిర్మించి ఉన్న విశిష్ట గల దేవాలయమన్నారు. రానున్న రోజుల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే సహకారంతో ప్రభు త్వ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామన్నారు.
సీతారాముల కళ్యాణం అనంతరం నృత్య రవళి కళాక్షేత్రం హనుమకొండ 40 మందితో కూచిపూడి భరత నాట్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా, మండలాల్లోని వివిధ గ్రామాల భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందలాని కోరారు.