calender_icon.png 27 October, 2024 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్య్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

13-08-2024 02:35:42 AM

సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం డీజీపీ జితేందర్‌తో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి గోల్కొండకోటలో ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలలో ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

వేడుకల నిర్వహణలో నిరంతరాయ ంగా విద్యుత్ సరఫరా, తాగునీరు, మెడికల్ స్టాల్, వాటర్ ప్రూఫ్ షామియానాలు, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రొటోకాల్ తప్పక పాటించాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏరియాలు, బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమెవెంట పోలీస్ కమిషనర్ శ్రీని వాస్‌రెడ్డి, జీఎడీ సెక్రటరీ వెంకట్రావు తదితరులు ఉన్నారు.