11-03-2025 03:16:27 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన అంజి రెడ్డిని మంగళవారం హైదారాబాద్ లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగేల నాగేశ్వరావు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాడు. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని హనుమాన్ ఆలయంలో 108 టెంకాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు.