12-03-2025 12:00:00 AM
హైకోర్టు తీర్పు రిజర్వ్
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాలకు సంబధించిన భూవివాదంలో చేవెళ్ల, మో కిలా పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసు ల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, ఆయన సతీమణి ఎ.ర జిత, తల్లి ఎ.రాజుభాయి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై మంగళవారంతో వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.