సీఎంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సర్కారు ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస లు కురిపించింది. గత నెలలో వాషింగ్టన్లో వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి చర్చల కోసం ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వైఎస్ చైర్మన్ మార్టిన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంకు కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లీడ్ నటాలియా, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్కు వచ్చారు.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాధాన్యతలుగా పెట్టుకున్న పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగు నీటి రంగాల్లో తీసుకుంటున్న చర్యల ను సీఎం వివరించారు. ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని కోరారు. వైద్య, విద్య రంగాల్లో రేవంత్ రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని రైజర్ ప్రశంసించారు.
రాష్ట్రం ఎంచుకున్న రంగాలే తమ ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజి త్ రెడ్డి, కార్యదర్శులు సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశో ర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియా నో జోంగ్తూ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.