ఖమ్మం, జూలై 14 (విజయక్రాంతి):తమకు ఇష్టమైన ఉపాధ్యాయులు వేరొక పాఠశాలకు బదిలీ అయ్యారు. వారిని వినూత్న రూపంలో సన్మానించాలని నిర్ణయించుకుని విద్యార్థులు పాఠశాలలో వారికి క్షీరా భిషేకం చేశారు. టీచర్లపై తమ అభిమానాన్ని విద్యార్థులు ఇలా చాటుకున్న ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండ లం మిట్టగూడెంలో వెలుగు చూసింది. గ్రామంలోని ప్రభు త్వ పాఠశాలలో ఉషాకుమారి, సురేష్, సునీత ఉపాధ్యాయులు పదేళ్ల నుంచి పాఠాలు చెప్తున్నారు. ఇటీవల వారు బదిలీల్లో భాగంగా వేరు పాఠశాలలకు బదిలీ అయ్యారు. వారికి శనివారం విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు.