calender_icon.png 22 October, 2024 | 7:03 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకం

22-10-2024 12:15:56 AM

సంగారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): జోగిపేట, వట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లతో పాటు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగిపేట వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్‌గా మక్త జగన్‌మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ యల్లంపల్లి సత్య నారాయణతో పాటు 16 మంది డైరెక్టర్లను నియమించారు. వట్‌పల్లి వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొప్పుల లక్ష్మిశేషారెడ్డి, వైస్ చైర్మన్ మన్నే ఈశ్వరయ్య ఎంపికయ్యారు. కొత్త పదవులు చేపట్టిన వారు వైద్యారోగ్య శాఖమంత్రి దామోదర్ రాజ నర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.