హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. వచ్చే నెలలో నూతన కమిటీ నియామకాలను అసెంబ్లీ స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పూర్తి చేయనున్నారు. అయితే, ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని కొంతమంది ప్రజా సంబంధాల వ్యవహారాల విభాగంలోని వ్యక్తులు.. జర్నలిస్టులకు ఫోన్ చేసి మీ మీడియా సంస్థ నుంచి ఒక పేరును సూచించండి అంటూ ఫోన్లు చేయడం చర్చనీయాంశంగా మారిం ది. అయితే, ఈ విషయాన్ని కొందరు మీడియా ప్రతినిధులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆయన ఆరా తీస్తున్నట్లు సమాచారం.