12-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 11(విజయక్రాంతి): జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు అందించనున్నారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు 1,292 మంది, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 240 మందిని ఇటీవల టీజీపీఎస్సీ ఎంపిక చేసింది.