06-04-2025 10:18:10 AM
మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల తనిఖీలు నిర్వహించేదుకు గాను ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల వయస్సు లోపు కలిగి ఉన్నవారు ఈ ఉధ్యొగాలకు అర్హులు అని పేర్కొన్నారు.
మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ ఉద్యోగాల్లో మెరిట్ సాధించిన వారికి నెలకు రూ33,800/ వేతనం చెల్లించడం జరుగుతుందని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోపు తమ వివరాలను https://forms.gle/SxGUdm3S2WS2zGfZ9 ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని కోరారు. గూగుల్ ఫారం , ఇతర వివరాలకు 8520860785 అనే నంబరుకు సంప్రదించాలని కోరారు.