calender_icon.png 29 March, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలి

25-03-2025 12:37:45 AM

అదనపు కలెక్టర్ వీరారెడ్డి 

యాదాద్రి భువనగిరి మార్చి 24 (విజయక్రాంతి) : వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన   దరఖాస్తులను   రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అర్జీలను స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 57 అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అందులో రెవిన్యూ శాఖ 43,   మున్సిపాలిటీ 3, జిల్లా పంచాయతీ శాఖ 3, గ్రామీణాభివృద్ధి శాఖ 2, దేవాదాయ శాఖ ,  సంక్షేమ , లేబర్, వ్యవసాయ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ లకు  ఒక్కొకటి చొప్పున  వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి  అధికారి నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.