calender_icon.png 16 April, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

16-04-2025 01:31:23 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): జిల్లాలో రెండు నూతన బార్(New Bars) లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కెజి నంద గోపాల్ కోరారు. బుధ వారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ లో ఒక నూతన బార్ కు, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక కొత్త బార్ లైసెన్సుల మంజూరికి దరఖాస్తులను  ఆహ్వానిస్తున్నామన్నారు. 2005 ఎక్సైజ్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 25 బార్ లో స్థానంలో కొత్త బార్ లకు అనుమతి ఇవ్వగా, జిల్లాలో రెండు బార్ లకు అవకాశం కల్పించారు.

ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 26లోపు కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య సమర్పించవచ్చునన్నారు.దరఖాస్తు రుసుముగా లక్ష రూపాయలు కాగా ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే అవకాశం ఉందన్నారు. 29న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ https://tgbcl.telangana.gov.in లో సందర్శించవచ్చునని, మరిన్ని వివరాలకు 87126 58773(జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి), 87126 58788(మంచిర్యాల ఎక్సైజ్ సీఐ), 87126 58785 (బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ) నెంబర్లలో సంప్రదించవచ్చునన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారం ఏ-1కు మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ లేదా పాన్ కార్డు జిరాక్స్ లను జతపరచాలని, దరఖాస్తు రుసుము రూ.1 లక్ష( నాన్ రిఫండ బుల్)తో డీడీ తీయాలని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 26న సాయంత్రం 5 గంటల్లోగా మంచిర్యాల లేక ఆదిలాబాద్ లేక హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాల్లో అందజేయాలని కోరారు.