calender_icon.png 16 March, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ

16-03-2025 11:38:41 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలో భాగంగా రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యలో ఈ పథకంపై ప్రజాభవన్ లో ఆదివారం సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ లు పాల్గొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించున్నారు. ఓబీఎంఎంఎస్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఏప్రిల్‌ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం రూ.3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60 శాతం నుంచి 80 శాతం వరకు రాయితీ ఇస్తారని, దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. పూర్తి వివరాలకు https://tgobmms.cgg.gov.in/ ను విజిట్‌ చేయండి. దరఖాస్తుల స్వీకరణ తర్వాత ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు. ఈ స్కీమ్ కు ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందజేస్తున్నట్లు అధికారులు ఢిప్యూటీ సీఎం ఇదివరకే చెప్పారు.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మండల స్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ​ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రాజీవ్​ యువ వికాసం పథకం అమలు చేస్తే.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 4,200 మందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని చెప్పింది.