హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): మహాత్మాజ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 502 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ పరమైన సమస్యలకు 112, మైనార్టీ సంక్షేమం కోసం 71, పౌరసరఫరాల శాఖకు 69, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 42, మున్సిపల్ శాఖకు 35, ఇతర శాఖలకు 173 దరఖాస్తు లు అందినట్టు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యే క అధికారి దివ్య పాల్గొన్ని దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.