హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 406 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలి పారు. గృహ నిర్మాణ శాఖకు 174, రెవెన్యూ 38, విద్యుత్ 38, మైనార్టీ సంక్షేమం 34, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 30, ఇతర శాఖలకు 92 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి కార్యక్రమం లో పాల్గొని, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.