డిజిటల్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు
కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రేషన్ కార్డుల జారీకి పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు.
అర్హులందరికీ డిజిటల్ రేషన్కార్డులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయిం చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వీ శేషాద్రి, కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్రావ్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘనందన్రావు, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.