calender_icon.png 24 September, 2024 | 12:01 AM

పాట్నా ఎన్‌ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్

22-09-2024 12:03:10 AM

పాట్నా, సెప్టెంబర్ 21: బీహార్ రాజధాని పాట్నాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ఏపీకి చెందిన విద్యార్థిని శుక్రవారం రాత్రి ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. రాత్రి 10.35 గంటలు దాటిన తర్వాత డెడ్‌బాడీని చూసిన తోటి విద్యార్థులు ఆ వెంటనే యాజమాన్యానికి సమాచారం  అందించారు. ఘటనా స్థలాని కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనాస ్థలంలో విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ లభించిందని వెల్లడించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో క్యాంపస్ లో ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.