calender_icon.png 28 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మియాపూర్ ఓయో లాడ్జిలో గవర్నమెంట్ టీచర్ మృతి

26-05-2024 02:32:14 PM

హైదరాబాద్: ఏపీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ లోని ఓయో లాడ్జిలో చోటుచేసుకుంది. మృతుడిని జయప్రకాష్ గా గుర్తించారు. జయప్రకాష్ విషం మాత్రలు మింగినట్లుగా లాడ్జి గదిలో ఆనవాళ్లు కనిపించాయని లాడ్జి సిబ్బంది తెలిపారు. జయప్రకాష్ రాయచోటిలో గర్నమెంట్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. లాడ్జి సిబ్బంది సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఇది హత్యా? ఆత్మహత్య ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.