అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ముంబైకు వెళ్తున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహా శుభకార్యంలో చంద్రబాబు పాల్గొననున్నారు. నేడు రాత్రి ముంబైలో సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ముంబైలో రాత్రి బస చేసిన ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముందు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంత శేష ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు.