18-02-2025 07:07:49 PM
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి శోభాయాత్రలో అంతర్గాం తాసిల్దార్ తూమ్ రవీందర్ పటేల్ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు) సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలింగ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.